Take a fresh look at your lifestyle.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

  • జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులు ఆదేశించారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.