మహాదేవపూర్, ముద్ర:
10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి స్థాయిలో పరీక్షలు అంటే భయం లేకుండా అవగాహన కల్పించాలన్నారు