ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో మున్సిపాలిటీ లోని 1వ , 6వ , 50వ , 51వ , 60 వ డివిజన్ లలో పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో పాదయాత్రగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు , పార్టీ శ్రేణులకు వివరించారు . ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులను ఇచ్చామన్నారు . సన్నబియ్యం , ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు.మహిళ సాధికారతే లక్ష్యంగా మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు . పాలమూరు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు . మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు . భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రచారంనిర్వహించారు . ఎన్నికల ప్రచారం లో భాగంగా మహబూబ్ నగర్ లోని ఏనుగొండ , అంబేద్కర్ చౌరస్తా , పాత పాలమూరు చౌరస్తా కూడళ్ల లో కార్యకర్తలతో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. 60 డివిజన్ లలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను , పార్టీ శ్రేణులను కోరారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సంజీవ్ కుమార్,జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి , మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సంజీవ్ , డా . రాజీవ్ , మిథున్ రెడ్డి , పార్టీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.