ముద్ర కూకట్పల్లి :
తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ మరియు సైబరాబాద్ కార్పొరేషన్ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పిలుపునిచ్చారు. కె.పి.హెచ్.బి ఫేస్-5 లోని తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సైబరాబాద్ కార్పొరేషన్ అడక్ కమిటీ మరియు సాదక్ ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను గడపగడపకూ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా క్రియాశీలక ఉద్యమి సభ్యత్వాల ద్వారా ప్రజలను పార్టీలోకి ఆహ్వానించాలి.
ప్రతి పేద కుటుంబానికి సభ్యత్వం అందేలా చూడాలి. పార్టీ అందించే భీమా పథకం ఆపద సమయంలో కుటుంబాలకు ఏ విధంగా అండగా ఉంటుందో వివరించి వారికి అవగాహన కల్పించాలి.
రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన జెండాను రెపరెపలాడించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ నియోజకవర్గ నాయకులు, జనసేన సాదక్ లు, జనసైనికులు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.