ముద్ర కూకట్పల్లి :
వివేకానంద నగర్, అల్లాపూర్ గాయత్రీ నగర్ డివిజన్లలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ నాగదేవత సహిత పోచమ్మ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పులిగోల్ల శ్రీనివాస్ యాదవ్, ప్రెసిడెంట్ కాయితి యాదవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కల్వల ఏడుకొండలు మరియు జనసేన నాయకుడు పవన్ నాయుడు ఆహ్వానం మేరకు ప్రేమ కుమార్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, ప్రాంగణంలోని ఫ్లోరింగ్ కోసం అవసరమైన గ్రానైట్ను అందజేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ కుమార్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజల విశ్వాసమే నా బలం, దేవాలయాల అభివృద్ధి నా బాధ్యత” అని స్పష్టం చేశారు. భక్తులందరి సహకారంతో ఈ పవిత్ర కార్యక్రామాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆత్మూరి మోహన్, పాదం సూర్య, జయమ్మ శ్రీను, గణేశుల నాగేశ్వరరావు, జెల్లా రవి, సూర్యనారాయణ, లలిత మాత గ్రూప్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.