Take a fresh look at your lifestyle.

​పీజేఆర్ నగర్‌లో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తాం: దొడ్ల వెంకటేష్ గౌడ్

​కూకట్‌పల్లి, ముద్ర:

అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్-2 లో నెలకొన్న త్రాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హామీ ఇచ్చారు.
​మంగళవారం కాలనీ వాసులు వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో ఆయనను కలిసి, తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలోని పౌర సమస్యలను శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి అలాగే సంబంధిత అధికారుల వద్దకు తీసుకువెళ్లి, పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తానని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మరియు నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.