ముద్ర ప్రతినిధి, నిర్మల్:
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే స్థానిక రాజీవ్ ఐటీఐ లో జరిగిన కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. give me