Take a fresh look at your lifestyle.

సిద్దిపేట జిల్లా ప్రతిభ గల యువతకు సువర్ణావకాశం – వచ్చే నెలలో భారీ జాబ్ మేళా – సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట జిల్లా లొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వచ్చే నెలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో జిల్లాలోని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సిపి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ఇప్పటికే 20కి పైగా ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయని , 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఎవరైనా ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చన్నారు.ఏదైనా విద్యా అర్హత (Any Educational Background) కలిగిన వారికి వారి నైపుణ్యానికి తగ్గట్టుగా అవకాశాలు కల్పించబడతాయన్నారు.. సామాజిక బాధ్యతగా యువతకు అండగా నిలవాలనుకునే మరిన్ని కంపెనీలు ఈ చొరవలో భాగస్వామ్యం కావాలని, ఆసక్తి గల సంస్థలు సిద్దిపేట పోలీసులను సంప్రదించాలని సీపీ కోరారు. జాబ్ మేళాలో పాల్గొనదలిచిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ పేర్లతో పాటు విద్యార్హత నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ లింక్ ఈ నెల చివరలో విడుదల చేయబడుతుందని, జిల్లాలోని యువత తమ ప్రతిభను చాటుకుని, స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ ముందడుగు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిపి రష్మీ పెరుమాళ్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.