Take a fresh look at your lifestyle.

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

 

ముద్ర…. తుంగతుర్తి….
ఇఫ్తార్ విందులు కేవలం ఆహారాన్ని పంచుకోవడమే కాదు దానితోపాటు ప్రేమ మరియు మతసామరస్యాన్ని పంచుకోవడమే ఇఫ్తార్ విందు ముఖ్య ఉద్దేశమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు, మంగళవారం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు, మతసామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీకగా నిలుస్తాయన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముస్లింలకు ఇఫ్తార్ విందు తో పాటు రంజాన్ తోఫా అందిస్తున్నట్లు తెలిపారు ఉపవాస దీక్షలో అందరూ కలిసి భోజనం చేయడం ద్వారా ప్రేమ ఆత్మీయత పెరుగుతాయని అన్నారు ఇది ఒక్క ముస్లిం సోదరులే కాకుండా ఇతర మతాలవారు కూడా పాల్గొనే గొప్ప సామాజిక సాంస్కృతిక సాంప్రదాయమని అన్నారు, ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం ఎంతో ముఖ్యమని వారు ఆచరించే ఉపవాస దీక్షలు ముస్లిం సోదరు లకు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తుందని అన్నారు, ఇఫ్తార్ ఉపవాసంలో ఉండే ఆకలిని త్యాగాన్ని దాతృత్వాన్ని తెలియజేస్తుందన్నారు, ఉపవాసం ఒక కఠినమైన ఉపవాసం తర్వాత తీసుకునేదే ఇఫ్తార్ విందు అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ తహసిల్దార్ కంట్లమయ్య ఆర్ఐ మణికుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా,
తిరుమల ప్రగడ కిషన్ రావు, ప్రవీణ్ రెడ్డి, ఉప్పుల రాంబాబు, కొండరాజు, పరశురాములు, మజీద్ నూర్ కమిటీ అధ్యక్షులు ఎండి జాన్, ఉపాధ్యక్షులు ఎస్కే లాలు, యూత్ కమిటీ అధ్యక్షులు ఎస్.కె నజీర్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్, కార్యదర్శి ఎస్కే కరీం, సభ్యులు నజీర్, శాలం, సిద్ధిక్, సమీర్ , మెహబూబలి, పజులుద్దీన్, మౌజిన్ ఎస్కే అలీ సాబ్, నాయకులు ఉస్మాన్, అక్రమ్, వహీద్, అఫ్జల్, నబి, ఎస్కే జానీ మియా, యాకూబలి, షరీఫ్, హఫీజ్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.