ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పద్మనాయక కళ్యాణ మండపంలో వేదపండితుల ఆధ్వర్యంలో విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం వేద పండితులు విషు శర్మ ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవగా షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆహుతులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి, జగిత్యాల అధ్యక్షులు ఆయిల్నేని సాగర్ రావు, ప్రధాన కార్యదర్శి దన్నపునేని వేణు గోపాల్ రావు, ఉపాధ్యక్షులు బండారి దివాకర్ రావు, సురిగీనేని కమలాకర్ రావు,సంయుక్త కార్యదర్సులు అయిల్నేని రవీందర్ రావు,ఇమ్మనేని ప్రశాంత్ రావు, కోశాధికారి వెన్నమనేని కృష్ణా రావు, కార్యవర్గ సభ్యులు తాండ్ర అనిల్ రావు,సురేందర్ రావు మెన్నేని, ప్రవీణ్ రావు, రాంప్రసాద్ రావు ,పునుగోటి సురేందర్ రావు, మహిళ కార్యవర్గ సభ్యులు బల్మూరి సరళ, బోయినపల్లి హరిప్రియ, అయిల్నేని శ్రీలత మరియు మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు, రాంచందర్ రావు, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
