ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో నూతన వీర శైవ యువ దళ్
ప్రకటించారు.సమాజ సేవే లక్ష్యంగా యువతను ఒక్కటిగా తీసుకువచ్చే దిశగా ఈ కమిటీ ఏర్పాటైనట్లు వీర శైవ సమాజ పెద్దలు తెలిపారు.
గౌరవ అధ్యక్షుడిగా అగ్గనుర్ సంకేత్, అధ్యక్షుడిగా వాలీ వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
ఉపాధ్యక్షులుగా మద్రికి చంద్రకాంత్, సడిగి వినోద్ కుమార్, బిర్కడ్ శివకుమార్ నియమితులయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా కోటం త్రిశూల్ ను ఎన్నుకున్నారు
సహాయ కార్యదర్శులుగా తుప్పుడు రవి కుమార్, ఫసారం గణేష్, హెరూర్ రాకేష్ ఎంపికయ్యారు.
కోశాధికారిగామడపతి సిద్దయ్య స్వామి ఎంపిక అయ్యారు.
అలాగే కార్యవర్గ సభ్యులుగా ఆడికి శ్రీశాంత్, గదిగి కిరణ్ కుమార్, మాడపతి నాగేంద్రప్రసాద్, అన్నారం దినేష్ కుమార్, ముదెళ్ళి ప్రశాంత్, గంగిమళ్ళ మహేష్ కుమార్, గౌనూర్ సందీప్ కుమార్, కెరెళ్ళి రాహుల్, ముత్తిరి వీరేశం, దోమ సతీష్ కుమార్, మఠం జగదీశ్వర్ స్వామి, సుంకరి సందీప్ కుమార్, బిర్కడ్ ప్రమోద్, గాండ్ల వినోద్ కుమార్, గాండ్ల పరమేశ్వర్, బంటారం జగదీశ్వర్, గూళి సైతేష్, కారంజి కార్తీక్, మంచాల నందీశ్వర్ లు ఎంపికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ వీరశైవ సమాజ అభివృద్ధి కొరకు అందరం కలసికట్టుగా పనిచేస్తామని తెలియజేశారు.