Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో లేదు: సీఎం రేవంత్ రెడ్డి

భూపాలప‌ల్లి జిల్లా ఎక్క‌డికి పోదు
రాష్ట్రంలో ఏ జిల్లానూ రద్దు చేయం
కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనే  లేదు
జిల్లాల పునర్విభజనపై విష ప్రచారాలు నమ్మొద్దు
ఒకవేళ చేయాల్సి వస్తే ప్రజామోదం, ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం
సింగరేణి మెడికల్ బోర్డు ఆలోచన లేదు
కాళేశ్వ‌రం పై సీబీఐ విచార‌ణ‌ను అడ్డుకుంటుందెవరూ…?
కేసీఆర్, కేటీఆర్, హ‌రీస్ రావును అరెస్టు చేసే వ‌ర‌కు కిషన్ రావే
కాళేశ్వరం అవినీతి కేసులో కేసీఆర్ కు రక్ష
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను కిషన్ రెడ్డి కాపాడుతున్నడు
బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలకు దెబ్బకు దెబ్బ కొడ‌తాం
మీ తాత‌లు, ముత్తాత‌లను తీసుకువ‌చ్చినా భరతం పడతాం
ఆడ‌బిడ్డ‌ల ఆశ్వీరాధం ఉంటే మోదీ, కేసీఆర్ తాత వ‌చ్చినా ఓడిస్తాం
వచ్చే బ‌డ్జెట్ లో ఇందిరమ్మ రెండో విడత ఇండ్లు మంజూరు చేస్తాం
భూపాలపల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, జయశంకర్ భూపాలపల్లి :
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాను తొలగించడం కానీ కొత్త జిల్లా ఏర్పాటు చేసే ఆలోచన తమ ప్రభుత్వ పరిశీలనలో లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎప్పుడైనా జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి, శాసనసభలో చర్చించి ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామన్నారు. భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ పార్టీ రద్దు చేయబోతోందని ఇటీవల కొంతమంది విషపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు చిల్లర మల్లర ప్రయత్నాలు, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోహాలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా భూపలపల్లి జిల్లా ఎక్కడికి పోదని స్పష్టం చేశారు. ఈ వేదిక నుంచి అపోహాలపైరాష్ట్రంలోని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరణ ఇస్తున్నానని సీఎం తెలిపారు. కుట్ర‌లు, కుతంత్రాల‌తో విష ప్ర‌చారాలు చేస్తున్న‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‍లో సీఎం పర్యటించారు. అక్కడ ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ సభలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీ లు వేరు వేరు కాదన్న సీఎం.. ఆయా పార్టీలు బొమ్మ‌, బొరుసులా.. బిల్లా రంగ‌ లా.. కాంగ్రెస్ ను ఓడించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. ఆయా పార్టీల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ ల కుట్రలకు దెబ్బకు దెబ్బ కొడ‌తామన్న సీఎం… మీ తాత‌లు, ముత్తాత‌లను తీసుకువ‌చ్చినా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు మీసంగ‌తి చూస్తారని హెచ్చరించారు. ఆడ‌బిడ్డ‌ల ఆశ్వీరాధం ఉంటే మోదీ, కేసీఆర్ తాత వ‌చ్చినా ఓడిస్తామన్నారు.  ఎవ‌రికి వారు తనను వాళ్లు త‌మ సామాజిక వ‌ర్గం పేరుతో పిల్చుకుంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఎవ‌రు ఎలాంటి పేరుతో పిలిచినా తాను సంతోషిస్తానని చెప్పారు.
తెలంగాణ లో మున్సిపాలిటీలు, కార్పేరేష‌న్ల కు  17,442 కోట్లు మంజూరు చేశామన్న సీఎం.. వీటిలో వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలోని మున్సిపాలిటీ ల‌కు రూ. 6116 కోట్లు ఇచ్చామన్నారు. భూపాల‌ప‌ల్లి మున్సిపాలిటీకి రూ. 92 కోట్ల నిధులు మంజూరు చేశామని వివరించారు. స‌ర‌స్వ‌తి పుష్క‌రాలు అద్భుతంగా నిర్వ‌హించుకున్నామన్నసీఎం… వచ్చే ఏడాది జరగనున్నగోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా బాస‌ర నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు రూ. 4వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి గోదావ‌రి ప‌రిహాకప్రాంతాన్ని ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రూ. 22,500 కోట్ల‌తో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇందిర‌మ్మ ఇండ్ల చొప్పన 4.5 ల‌క్ష‌ల ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని సీఎం వివరించారు. వచ్చే బ‌డ్జెట్ లో పేద‌ల ఆత్మ‌గౌర‌వం పెరిగేలా, ఆడ‌బిడ్డ‌లు ఆశ్వీర‌దించేలా రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధణలో తొలి, మలిదశ ఉద్యమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకం అని సీఎం అన్నారు. నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు దేశానికి ఆదర్శం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. భూపాలపల్లి కుగ్రామంగా ఉన్న సమయంలో అన్న నందమూరి తారకరామరావు మొట్టమొదట దీన్ని మండల కేంద్రంగా మార్చి సింగరేణి బొగ్గు ఉత్పత్తికి మొట్టమొదటి పునాది రాయి వేశారనీ దాంతో ఆ తర్వాత భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదన్నారు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిందన్నారు.
మెడికల్ బోర్డు ఆలోచన లేదు:
 సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డు విషయంలో విపక్ష పార్టీ నేతలు విషం చిమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి వారిని మోకాళ్లపై కూర్చొబెడుతామని స్పష్టం చేశారు.ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మెడికల్ బోర్డు ఆలోచన ప్రభుత్వ ఆలోచనలో లేదన్నారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటి సింగరేణి కార్మికులకు నష్టం చేసే ఏ పనిని ఈ ప్రభుత్వం చేయదన్నారు. డిస్మిస్ కార్మికులు 217 మంది ఉన్నారని నా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
ఆ ముగ్గురిని అరెస్ట్ చేసేంత వరకు నువ్వు కిషన్ రావే..
కిష‌న్ రెడ్డి.. ముమ్మాటికీ కేసీఆర్ కు ద‌త్త‌పుత్రుడేనని సీఎం పునరుద్ఘాటించారు. క‌ల్వ‌కుంట్ల కిష‌న్ రావు గా మారిన కిష‌న్ రెడ్డి… కాళేశ్వరం అవినీతి కేసులో కేసీఆర్ ను అరెస్టు చేయ‌కుండా అడ్డుప‌డుతున్నాడని ఆరోపించారు. దీనిపై తాను నిలదీస్తే… కేసీఆర్ ను అరెస్ట్ చేయ‌డానికి నేను ఏమైనా సీఎం నా అని కిష‌న్ రెడ్డి అంటున్నారని చెప్పారు. న‌ల్లికుంట్ల మాట‌లు మాట్లాడుతున్న కిష‌న్ రెడ్డి… తనఫెవికాల్ బంధంతో కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావుల‌ను కంచె వేసి కాపాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హ‌రీస్ రావును అరెస్టు చేసే వ‌ర‌కు కిషన్ రెడ్డిని క‌ల్వ‌కుంట్ల కిష‌న్ రావు అనే పిలుస్తానన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను కాపాడుతుంది మీరు కాదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. రూ.వేల‌కోట్ల ఆస్తుల‌ను పేద‌ల కోసం దానం చేసిన సోనియా, రాహుల్ గాంధీ ని కేసుల పేరుతో  సీబీఐ, ఈడీ పేరుతో తిప్పించి అమానించ‌లేదా..? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. గాంధీ కుటుంబాన్ని మాన‌సిక క్షోభ క‌ల్గించిన మీకు ఉసురు త‌గ‌ులుతుందన్నారు. ఇప్పటికీ రాహుల్ గాంధీని ఈడీ, సీబీఐ కేసుల‌తో వేధిస్తున్నారని సీఎం మండిపడ్డారు. గాందీ కుటుంబంపై ఈడీ , సీబీఐ ని ఉప‌యోగిస్తున్న‌ప్పుడు కాళేశ్వ‌రం పైన సీబీఐ విచార‌ణ‌కు పంపిస్తే ఎవ‌రు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. 10 ఏళ్లు కేసీఆర్ సీఎం గా, మూడు సార్లు మోదీ ప్ర‌ధానిగా ఉన్నారన్న ఆయన రాష్ట్రానికి ఎలాంటి మేలు చేకూర్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప‌దేళ్లు సీఎంగా ఉండి భూపాల‌ప‌ల్లి కి బై పాస్ రోడ్డు తీసుకురాలేదని మండిపడ్డారు. ఎర్ర‌వెల్లి పామ్ హౌస్ లో బోర్లా బొక్క‌లా ప‌డుకున్న కేసీఆర్ మీకు నిధులు ఇవ్వరని ప్రజలకు చెప్పారు. కేసీఆర్ ఇంటిల్లిపాలికి ప‌ద‌వులు ఇచ్చుకున్న‌డు..కాని పేద‌ల‌కు ఏమీ చేయ‌లేదని మండిపడ్డారు. ప్రధాని మోడి కూడా.. ఏనాడు భూపాలప‌ల్లికి రాలేదన్నారు. కేసీఆర్, మోదీని చూసి ఓటు వేస్తే మోస‌పోతారు జాగ్ర‌త్త‌ అని ఓటర్లను అప్రమత్తం చేశారు. పెళ్లి పెద్ద‌ను చూసి పిల్ల‌ను ఇస్తే సంసారం ఆగం అవుతుందన్న సీఎం.. కాంగ్రెస్ కు ఓటేస్తే మీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయన్నారు. మున్సిప‌ల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీరు  తిక్క‌లోడు తిరునాళ్ల‌కు పోయిన‌ట్లుందని సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు గెలిపిస్తే  గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి  కేసీఆర్ సంక‌న చేరారని విమర్శించారు.బ్లాక్ మెయిల్ రాజ‌కీయ స‌మితి
బీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి బ్లాక్ మెయిల్ రాజ‌కీయ స‌మితి.అని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు ఫోన్ ట్యాపింగ్ తో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు, జ‌డ్జిలు, సినీతార‌ల‌ను వ‌ద‌ల‌లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భార్య‌భ‌ర్త‌లు ఫోన్లలో మాట్లాడుకున్న విషయాలు వినే పాపాత్ములు ఎవ‌రైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారుల‌ను బ్లాక్ మెయిల్ చేసిన గత పాలకులు వారి ఆస్తులు రాయించుకున్నార‌ని చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి స్వ‌యంగా చెప్పారని గుర్తు చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి రూ.వంద‌ల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ. 1500 కోట్లు ఎవ‌డ‌బ్బ సొమ్ము అని సీఎం ప్రశ్నించారు. చేసిన పాపాలు ఊర్కే పోవన్న సీఎం… .చేసిన పాపాల ఊబిలో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోతుందని చురకలంటించారు.

Leave A Reply

Your email address will not be published.