ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ కలెక్టరేట్ సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్లలోని ఒక ఇంట్లో శనివారం రాత్రి ఫ్రిజ్ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ తో పాటు మరో మహిళను ఆసుపత్రికి తరలించారు. కాగా వారిద్దరూ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు.