Take a fresh look at your lifestyle.

పోలింగ్ సిబ్బంది కి ర్యాండమైజేషన్ ప్రక్రియ

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది కి ర్యాండమైజేషన్ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి, సమక్షంలో నిర్వహించారు.
బుధవారం ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ లలో వార్డుల ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు , ఇతర పోలింగ్ అధికారులు ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లాలోని 104 వార్డు స్థానాలకు, ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 257, అసిస్టెంట్.పీ.ఓలు 257,ఇతర పోలింగ్ అధికారులు 514 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు.
ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.