ముద్ర, తాండూర్:
తాండూర్ మండలం గౌతాపూర్ సమీపంలో తాండూర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం రోజున తనకీలు నిర్వహించారు. ఈ క్రమంలో గౌతాపూర్ సమీపంలో నా పరాతి పాలిష్ యూనిట్లో కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి ముస్తకిన్ దగ్గర 3. 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.