Take a fresh look at your lifestyle.

అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా

ముద్ర ప్రతినిధి, మెదక్:
అంగన్వాడీలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐసిడిఎస్ డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం, సఖి కేంద్రం,
నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ ను సోమవారం సందర్శించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో కనీస సౌకర్యాలు విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో సఖి కేంద్రం సిబ్బందితో సమీక్షించారు. డీవీ కేసుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలసదనం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి 99 రోజుల్లో పూర్తి చేసే దిశగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలని ఆదేశించారు. బాలసదనం పిల్లల సంరక్షణ, పోషకాహారం అందించి బలాన్ని పెంచాలని ఆదేశించారు.
పోషకాహార సేవలను బలోపేతం చేయడం, అంగన్‌వాడీ మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని అంగన్వాడి సెంటర్స్, సఖి సెంటర్లలో మెరుగైన సేవలు అందుతున్నాయని చెప్పారు.
వెంట డిడబ్ల్యుఓ హేమ భార్గవి, సిడిపిఓలు, సూపర్వైజర్ లున్నారు.

Leave A Reply

Your email address will not be published.