ముద్ర, గద్వాల: ఎలాంటి అనుమతులు లేకుండా గట్టు మండలం బల్గెర నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను శుక్రవారం కేటిదొడ్డి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.శ్రీనివాసులు తెలిపారు.
చింతలకుంటకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న క్రమంలో పోలీసులు ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని, ట్రాక్టర్ డ్రైవర్ హన్మంతు, మరియు ఓనర్ రమేష్ ల పై కేసు నమోదు చేశారు.