Take a fresh look at your lifestyle.

తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు 

 

 ముద్ర : మల్కాజిగిరి

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని  తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి , వారి సతీమణి  మర్రి మమత రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు  చామకూర మల్లారెడ్డి తో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు దేశ ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని శ్రీ వీరాంజనేయ స్వామివారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు పాండు, గజ్జెల నాగేష్, నాయకులు టి.ఎన్. శ్రీను, జె.ఏ.సి వెంకన్న, సురేష్ తదితర నాయకులు  భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.