ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలలో 7వ రోజు శనివారం ఉదయం పల్లకీ సేవలో స్వామివారు దివ్యంగా విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిచ్చి కటాక్షానుగ్రహం ప్రసాదించారు. ఆలయంలో సుప్రభాత సేవతో మొదలుకొని నిత్య కైంకర్యాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
