జగన్కు ఎందుకు దూరమయ్యానో త్వరలోనే చెప్తాను
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉన్న తాను.. జగన్కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేనన్న ఆయన.. ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సిందేనన్నారు.
ఒకరోజు ప్రెస్మీట్ పెట్టి అన్నీ వివరిస్తానని తెలిపారు. అదానీ సంపద గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే..దేశ ద్రోహమా అని నిలదీశారు. రాహుల్కు జరిగిన అన్యాయంపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా స్పందించారని.. ఒక్క ఏపీ మినహా అంటూ విమర్శించారు. అయితే తాము చేసే పోరాట కార్యక్రమాలను అణచివేయవద్దని జగన్కు విజ్ఞప్తి చేశారు.