సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు

ఖమ్మం, ముద్ర: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.