విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు అనుమతి కోరిన ఏపీ సీఎం జగన్

విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు అనుమతి కోరిన ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఇది ముగిసిన తర్వాత కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. మే 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల పర్యటనకు అనుమతిని ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. కోర్టులో వ్యాజ్యాలు విచారణలో వున్నందున ఆయనను దేశం విడిచి వెళ్లరాదని బెయిల్ షరతులలో ఉంది. ఈ షరతును సడలించి, తనకు విదేశాలకు వెళ్లేందుక అనుమతిని ఇవ్వాలని ఆయన కోర్టను అభ్యర్థించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐను కోర్టు ఆదేశించి, విచారణను వాయిదా వేసింది.