ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చెయ్యనుంది. నేటి ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా రిలీజ్ చేయనుంది. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చెయ్యనుంది.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు సైతం నేటి నుంచి షురూ కానున్నాయి. తిరుమలలో సిఫార్సు లేఖల పై వీఐపీ బ్రేక్ దర్శనాల జారీని టీటీడీ పాలక మండలి పున: ప్రారంభించింది. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16వ తేదీ నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో మళ్లీ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభిస్తున్నారు. సిఫార్సు లేఖల స్వీకరణపై టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా ఎన్నికల సంఘం స్పందించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి.