గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కుంభం 

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కుంభం 

ముద్ర ప్రతినిధి, భువనగిరి : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం
భువనగిరి మండలంలోని హన్మపురం, బస్వపురం, ముత్తిరెడ్డిగూడెం, అనాజీపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. హన్మపురం మదిర కుర్మగుడెం గ్రామంలో బీసి కమిటి హాల్, ప్రహారీ గోడను ప్రారంభించారు. 

బస్వపురం గ్రామంలో ఫంక్షన్ హాల్, ప్రాధమిక పాఠశాలలో అదనపు తరగతి గది, డైనింగ్ హాల్, ముత్తిరెడ్డి గూడెం గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో కిచెన్ హాల్ ను ప్రారంభించారు. అనాజిపురం గ్రామంలో సిసి రోడ్ కు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, తాసిల్దార్ అంజిరెడ్డి,  కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపిటిసి పాశం శివానంద, కాంగ్రెస్ మండల నాయకులు మచ్చ నరసింహ గౌడ్, చిక్కుల వెంకటేష్, నానం కృష్ణ గౌడ్, ఉడుత కార్తీక్ పాల్గొన్నారు.