జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట భద్రత - ఎస్పీ సన్ ప్రీత్ సింగ్  

జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట భద్రత - ఎస్పీ సన్ ప్రీత్ సింగ్  

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లా కేంద్రంలో  నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతగా ఎలాంటి సంఘటనలు జరగకుండ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని  ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను  ఎస్పీ పరిశీలించారు.  

గ్రూప్-1   ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 7692 మంది అభ్యర్థులు 22 పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు సుదూర ప్రాంతాల నుండి పరీక్ష వ్రాసేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సరయిన సమయంలో చేరుకోనేందుకు జిల్లా  పోలీసుల అధ్వర్యంలో  అన్ని ఏర్పట్లను చేయడం జరిగిందని తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామని,  ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ  పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా  చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎస్పీ  వెంట అదనపు ఎస్పీ  వినోద్ కుమార్, డిఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఉన్నారు.