ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ భాష

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ భాష
District Collector Sheikh Yasmin Bhasha

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  షేక్ .యాస్మిన్ భాష .సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 33. ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. జిల్లాకు బదిలీపై వచ్చి మొదటిసారి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషకు జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులు స్వాగతం పలికి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా  అదునపు కలెక్టర్లు బిఎస్ లతా .  మంద. మకరంద, ఆర్డీవోలు మాధురి .వినోద్ కుమార్  ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.