వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం
  • హాజరైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి


చండూరు,ముద్ర: నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లిగ్రామంలోశ్రీరామలింగేశ్వర స్వామిబ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అర్చకుల,వేదమంత్రాల మధ్యఅంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యేరాజగోపాల్ రెడ్డిహాజరై పట్టు వస్త్రాలు,తలంబ్రాలుస్వామివారికి సమర్పించారు. వేద పండితుల  మంత్రోచ్ఛరణ లతో శాస్త్రోక్తోంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలపైశ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జయరామయ్య,దేవస్థాన కమిటీ చైర్మన్ గజ్జల కృష్ణారెడ్డి,ఆలయ అర్చకులుకారువంగ నరసింహ శర్మ, తిరుపతయ్య శర్మ, శంకర శర్మ, గిరి ప్రసాద్ శర్మ, హరి ప్రసాద్ శర్మ,పాలకమండలి సభ్యులుతదితరులు పాల్గొన్నారు