మోటార్ సైకిల్ అదుపుతప్పి వృద్ధుడు మృతి

మోటార్ సైకిల్ అదుపుతప్పి వృద్ధుడు మృతి

ముద్ర ప్రతినిధి, నల్గొండ/మునుగోడు: మోటార్ సైకిల్ ( టీవీఎస్ ఎక్సెల్) ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై ఏర్పాటు చేసిన బార్ గేట్లకు తాకి డ్రైనేజీలో పడి మృతి చెందిన సంఘటన మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడం సమీపంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదే మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన భీమనపల్లి శంకరయ్య (65) అనే వృద్దుడు ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే కమ్మగూడం పరిసర ప్రాంతంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన బార్ గేట్లకు టీవీఎస్ ఎక్సెల్ తాకి తను పక్కనే ఉన్న డ్రైనేజీలో పడడంతో గమనించిన స్థానికులు అతనిని డ్రైనేజీ లో నుండి తీసి పోలీసులకు సమాచారం అందజేయగా, పోలీసులు అంబులెన్స్ సహాయంతో మునుగోడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి నేరుగా కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు అంబులెన్స్ వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.