కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం..

కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం..
  • పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం సిఎం రేవంత్ రెడ్డి 
  • కొడంగల్ లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లో సోమవారం ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని,అలాగేఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని అన్నారు.బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోంది..

సెప్టెంబర్ 17, 2025తో మోదీ 75 ఏళ్లు నిండుతాయి అని అన్నారు.ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలి అని అన్నారు.

మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏ కు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని అన్నారు.బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది.. 400 సీట్లు ఎట్లా సాధ్యం? అని ప్రశ్నించారు.

13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదు.దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు.సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి అని అన్నారు.

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదు.దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారు అని అన్నారు.

ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతోంటే... మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది..

ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్ దీన్నిబట్టి తెలుస్తోంది అని అన్నారు.

ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధం..

దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవు... 

నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ పై చర్యలు లేవు..

బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదు అని విస్మయం వ్యక్తం చేశారు.

కానీ ఒక వీడియో వైరల్ కేసులో మాపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగింది..

ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనం అని అన్నారు.

బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా?

కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడుగుతున్నా..

ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండి అని డిమాండ్ చేశారు.

మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు..

రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం..రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదు అని అన్నారు.పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు .

రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోంది అని అన్నారు.యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోంది..

కేసీఆర్ పై నాకు సానుభూతి ఉంది.. 

మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు..కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారు అని అన్నారు.