ప్రభుత్వ పుస్తకాలు పాత సామాను షాపులో....

ప్రభుత్వ పుస్తకాలు పాత సామాను షాపులో....

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా: విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు పాత సామాను దుకాణంలో ప్రత్యక్షమైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలను  రాత్రికి రాత్రి పాత సామాను కోనుగోలు చేసే వ్యక్తి దుకాణంలో దర్శనమిచ్చాయి.పేద విద్యార్థులను విద్యకు దూరం చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు..నోట్ బుక్స్ రెండు జతల డ్రస్సింగ్ ప్రతి ఏడాది అందిస్తోంది.ఈ ఏడాది విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన మొదటి రోజే ఇవన్నీ అందించారు.కానీ నాగర్ కర్నూల్ జిల్లా  అచ్చంపేటలో విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు  పాత సామాను కోనే దుకాణంలో దర్శనమిచ్చాయి.


ఈ పుస్తకాలను నిన్న రాత్రి ఓ వ్యక్తి అమ్మినట్లుగా తెలిపారు.ఈ పాఠ్య పుస్తకాలు అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందినవిగా గుర్తించారు.అచ్చంపేటకు చెందిన  విద్యార్థి సంఘ నాయకులు పాత సామాను దుకాణంలో పరిశీలించగా ఈ పాఠ్య పుస్తకాల బాగోతం బయటపడింది.అచ్చంపేటకు చెందిన శంకర్ అనే వ్యక్తి అమినట్లుగా గుర్తించారు.విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాలు పాత సామాను దుకాణానికి తూకం కింద 6వేల 9వందల రూపాయాలకు అమ్మినట్లు తెలుస్తోంది.విద్యార్థి సంఘ నాయకులు జోక్యం చేసుకొని పాత సామాను దుకాణంలోని పుస్తకాలను తిరిగి పంపించారు.సంబందిత అధికారులకు సమాచారమిచ్చారు.బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకొని పుస్తకాలను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.స్పందించిన గిరిజన సంక్షేమశాఖ  అధికారి కమాలాకర్ రెడ్డి.. .ఇద్దరు వర్కర్లు ...కాశన్న..దానమ్మ ను సస్పెండ్ చేశారు.గోడౌన్ ఇంచార్జి తిరుపతయ్యకు షోకాజ్ నోటీసిచ్చారు.పూర్తి విచారణ చేస్తామని తెలిపారు.