9 మంది డాక్టర్లకు వైద్యరత్న అవార్డులు

9 మంది డాక్టర్లకు వైద్యరత్న అవార్డులు
  • జూలై 1న గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం

ముద్ర తెలంగాణ బ్యూరో, హైదరాబాద్:  వైద్యరంగంలో విశేషమైన సేవలు అందించిన తొమ్మిది మంది ప్రఖ్యాత వైద్యులను "వైద్యరత్న" పురస్కారంతో సత్కరించనున్నట్లు శ్రీరామానుజ సేవాట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ తెలిపారు. అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జూలై 1న రాజ్ భవన్ లో జరిగే  కార్యక్రమంలో గవర్నర్ సీ.పి.రాధాకృష్ణన్  చేతుల మీదుగా సత్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

 ప్రతియేటా వైద్యరంగంలో అత్యంత సేవానిరతి కనపరిచి, వృత్తిగత విశేష నైపుణ్యం కలిగిన ప్రముఖ వైద్యులను శ్రీరామానుజ సేవాట్రస్ట్ "వైద్యరత్న" విశిష్ట పురస్కారంతో సత్కరించే ఆనవాయితీని కొనసాగిస్తున్నది. ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఈసారి కూడా జూలై 1న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నామని, గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ అందుకు అంగీకరించారని ధనుంజయ తెలిపారు.