ఇన్ఫార్మర్ నెపంతో ఒకరి హత్య

ఇన్ఫార్మర్ నెపంతో ఒకరి హత్య
  • బీజాపూర్ లో మావోల ఘాతకం

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ-ఛత్తీస్ గడ్ సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొన్నది. బీజాపూర్ జిల్లా టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో ఓ గ్రామస్థుడిని హత్య చేశారు. మావోయిస్టుల ఘాతుకంపై భయంతో ఉన్న‌ మృతుడి కుటుంబ సభ్యులుఈ ఘటనపై ఇంత వరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. చిన్నగెల్లూరుకు చెందిన రామ పుణేమ్‌ (రాముడు)ను మావోయిస్టులుఈ నెల18న అపహరించి తమ వెంట తీసుకెళ్లారు. మూడు రోజుల తర్వాత, నిన్న రాత్రి రాముడిని విచారించి.. పోలీసు ఇన్‌ఫార్మర్ అని భావించి హత్య చేసినట్లు సమాచారం.   స్టేషన్లో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ ఘటనను అధికారులు ధృవీకరించలేదు.