నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి...  బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్

నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి...   బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- తెలంగాణ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి కి ప్రతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బడుగు శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2,3 పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అదేవిధంగా డీఎస్సీ పరీక్షల తేదిలను వాయిదా వేసి, మెగా డీఎస్సీ ని ప్రకటించాలన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోళనుకొండ ప్రభాకర్, గంగపురం శ్రవణ్ కుమార్, వంగూరి సిద్దు, ఇట్టామోని బాలు, చిలువెరు నరేందర్, గడ్డం మహేష్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.