బెల్టు షాపులపై పోలీసుల దాడి....

బెల్టు షాపులపై పోలీసుల దాడి....

మాజీ ఎంపీటీసీ మద్యం షాపులో ఆకస్మిక దాడి..

తుర్కపల్లి, ముద్ర :మండలంలోని దత్తాయ పల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు మాజీ ఎంపీటీసీ కొండం రఘురాములు మద్యం షాపులో ఆకస్మిక దాడి నిర్వహించినట్లు తెలిపారు। షాపు దారులు ఇకనైనా మానుకోవాలని లేదంటే ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.