అయిదేళ్ల తర్వాత రష్యాలో ప్రధాని మోదీ పర్యటన

అయిదేళ్ల తర్వాత రష్యాలో ప్రధాని మోదీ పర్యటన

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. అయిదు సంవత్సరాల తరువాత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో రష్యాలో ఆయన పర్యటించనున్నారు. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ తో పాటు మోదీ పాల్గొననున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరపనున్నారని తెలిపింది. రష్యా పర్యటన ముగించుకున్నాక మోదీ ఆస్ట్రియా దేశంలో పర్యటిస్తారని వెల్లడించింది. గత 41 సంవత్సరాల్లో ఆస్ట్రియాను భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి కానుంది. రష్యాలో చివరిసారిగా మోదీ 2019లో వ్లాడివోస్టాక్ పట్టణంలో ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు.