ఘనంగా అమరజీవి వర్ధంతి

ఘనంగా అమరజీవి వర్ధంతి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పార్షి కమల్ కుమార్ తోపాటు ఆర్యవైశ్య మహాసభ జిల్లా మండల కమిటీ సభ్యులు వ్యాపారవేత్తలు మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అయిత బుచ్చిబాబు, ఆర్య వైశ్య సంఘం మండల మాజీ అధ్యక్షులు నాగ బండి వెంకట్రాం నరసయ్య, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు బెల్దే వెంకన్న, బెల్దేసతీష్ ఆర్య వైశ్య సంఘం పట్టణ మాజీ అధ్యక్షులు కౌడా లక్ష్మీనారాయణ, వాసవి క్లబ్ మాజీ డిప్యూటీ గవర్నర్ తెల్లాకుల రామకృష్ణ, నూక రమేష్, పాలకుర్తి శ్రీనివాస్, గౌరీశెట్టి శ్రీనివాస్, తుమ్మలపల్లి రవి కిషన్, పార్శి భువన్, ఆంచూరి శ్రీరాములు, ఆకుల మాణిక్యం ప్రముఖులు పాల్గొన్నారు.