ఏటీఎంల వద్ద భద్రత పెంచండి - ఎసిపి శ్రీనివాసరావు

ఏటీఎంల వద్ద భద్రత పెంచండి - ఎసిపి శ్రీనివాసరావు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పెంచాలని స్థానిక ఏసిపి శ్రీనివాసరావు ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో శుక్రవారం అన్ని బ్యాంకు మేనేజర్ల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, ఏటీఎంలో వద్దు సైబర్ నేరాలు జరగకుండా ఉండేందుకు తగిన భద్రత ఏర్పాటు చేసి ఖాతాదారులకు భద్రతతో కూడిన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశం లో రఘునాథపల్లి సిఐ శ్రీనివాస రెడ్డి  ఎస్సైలు పాల్గొన్నారు.