హై కోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

హై కోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

ముద్ర,తెలంగాణ:- హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుండి ప్లాట్ కొనుక్కున్నాడు ఎన్టీఆర్. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా లోన్స్ పొందారు గీతలక్ష్మి కుటుంబం. 3/4 బ్యాంక్ ల నుండి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ లోన్ పొందిన గీత లక్మి…. జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో విషయాన్ని దాచిపెట్టింది. ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ పొందిన గీత లక్ష్మి జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో విషయాన్ని దాచిపెట్టింది.

కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పింది గీత లక్ష్మి. అయితే… చెన్నై లో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ప్లాట్ ఓనర్ గా తారక్ ఉన్నారు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతోంది. ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు బ్యాంక్ మేనేజర్లు. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. తాజాగా DRT లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమంది హై కోర్టు. జూన్ 6న విచారణ చేపడతామని తెలిపింది.