వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసిన నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
![వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసిన నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a598b58b641.jpg)
ముద్ర కాప్రా:-హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీ ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు రేగిళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ వికలాంగులకు చేయూతనిచ్చే కార్యక్రమం తన ఆధ్వర్యంలో నిర్వహిస్తానని తెలిపారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.