బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కి అప్పగించాలి

బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కి అప్పగించాలి
  • బొగ్గు గనుల వేలం పాటను నిలుపుదల చెయ్యాలి
  • సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం డి జబ్బార్

ముద్ర,పానుగల్:-బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అప్పగించాలని,బొగ్గు గనుల వేలం పాటను నిలుపుదల చెయ్యాలని కోరుతూ పానుగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం పార్టీ  మండల కమిటీ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ మాట్లాడుతూ దేశంలో 500 బొగ్గు గనులు ఉండగా ఇప్పటికే 300 బొగ్గు గనులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కారు చౌక కు కట్టబెట్టారని నేడు 67 బొగ్గు గనులను వేలంపాట ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడిదారులకు వేలం పాట ద్వారా అప్పగించేందుకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. దీని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

బొగ్గు గనులను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని పదో విడత వేలం ప్రక్రియ మొదలు పెట్టారని రాష్ట్రానికి చెందిన జి కిషన్ రెడ్డి కేంద్ర గనుల శాఖ మంత్రి పదవి చేపట్టగానే తెలంగాణకు తీరని అన్యాయం చేయబోతున్నారని విమర్శించారు.తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కూడా వేలం వేయడం శోచనీయమని పేర్కొన్నారు.ఈ బుక్ బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తామని అన్నారు.వనపర్తి జిల్లా కేంద్రంలో జూన్ 28వ తేదీన నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నందున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు భగత్, జి వెంకటయ్య, జంబులయ్య, నరసింహ, మన్యం, యాదగిరి నాగేష్ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.