యువత డ్రగ్స్ కు బానిస కావొద్దు

యువత డ్రగ్స్ కు బానిస కావొద్దు
  •  తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి
  •  జిల్లా అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : యువత డ్రగ్స్ కు బానిస కాకుండా భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ మారకద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి ర్యాలీ మొదలై ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం వరకు జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ కు యువత బానిస కావద్దని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతోనే అంతమవుతుందని ఆయన అన్నారు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై అణునిత్యం దృష్టి సారించాలని ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గం నిర్దేశనం చేయాలని సూచించారు డ్రగ్స్ కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వారం అవుతామని అన్నారు మెదడు నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశం ఉంటాయని తెలిపారు. 

అలాగే మారకద్రవ్యాలు అమ్మడం సేవించడం రెండూ నేరమేనని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్ స్టాండ్స్ ఆక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదని తెలిపారు పోలీస్ శాఖ జిల్లాలో డ్రగ్స్ గంజాయి నివారణ పట్ల యువకులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1923లో వనపర్తి జిల్లాలో గంజాయికి సంబంధించి ఒక కేసు నమోదు అయిందని ఇందులో ఒకరిని అరెస్టు చేయడంతో పాటు రెండు వందల గ్రాముల గంజాయిని సీట్ చేయడం జరిగిందని తెలిపారు తర్వాత వనపర్తి జిల్లాలో గల కళాశాలల స్టూడెంట్స్ తో ప్రమాణం చేయించడం జరిగిందని తెలిపారు.