రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి..
![రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి..](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_66597fe724222.jpg)
- వేములవాడలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ
- కలెక్టర్ అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :జిల్లాలోని రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.శుక్రవారం వేములవాడ పట్టణం లోని మన గ్రోమోర్ సెంటర్, శ్రీ లక్ష్మి ఎరువుల విత్తనాలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విక్రయాల నిర్వహణను, రిజిస్టర్ లను ,స్టాక్ వివరాలు పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ వానాకాలం 2024 పంటలకు జిల్లాలో అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే స్టాక్ పెట్టుకుని రైతులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.మన జిల్లాలో సైతం ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేర ఎరువుల నిలువలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎరువుల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.
దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకూడదనీ, అమ్మినచో కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులకు సరిపోయే పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తే పి డి అక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఓ సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.