నేటి యువత గాంధీజీ మార్గాన్ని అనుసరించాలి..
![నేటి యువత గాంధీజీ మార్గాన్ని అనుసరించాలి..](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651a826be1176.jpg)
- గాంధీజీ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించాడు
- బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: గాంధీజీ స్ఫూర్తితోనే సీఎం కెసిఆర్ అహింస మార్గంలో తెలంగాణ సాధించాడని, మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సహకారం అవుతుందని బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. సోమవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలను పురస్కరించుకొని
మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలతో పాటు శాస్త్రి నగర్ కూడలిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ గాంధీజీ స్పూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య సాధనలో మహాత్ముడి కృషి మరవలేనిదని, నేటి యువత గాంధీజీ మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. శాంతి, అహింస మార్గాలే అభివృద్ధికి చిహ్నాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, గూడూరి మధు, కందుల క్రాంతి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు ఉన్నారు.