కిషన్ రెడ్డి అరెస్టు ను నిరసిస్తూ బీజేపీ నాయకుల నిరసన...
ముద్ర, గంభీరావుపేట : బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో నీ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు కండ్లకు నల్ల బ్యాడ్జిని ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దీక్షను ప్రశాంతంగా జరిపేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ, పోలీసులు అక్రమంగా వ్యవహరించారని అన్నారు. కిషన్ రెడ్డి చేస్తున్న దీక్షకుతెలంగాణ నిరుద్యోగ యువతనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో జీర్ణించుకోలేకే సిఎం కేసిఆర్ పోలీసులను పురమాయించారని ఆరోపించారు. శాంతియుత నిరసనల కు కూడా సి ఎం కేసీఆర్ తట్టుకోలేక పోతున్నాడని,దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సిఎం కేసిఆర్ కీ సరైన సమాధానం చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొమ్మనపల్లి దేవయ్య, ఓబీసీ జిల్లా సెక్రెటరీ మేకర్తి శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నల్ల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు మద్దుల రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్,ఓబిసి మండల అధ్యక్షుడు మురళీమోహన్ నాయకులు అక్కల దేవి మహేష్, శనిగరం సర్వోత్తమ్, కుర్ల దేవరాజు, బోదాసు స్వామి ఎల్లయ్య,దేవరాజు గౌడ్, పొన్నాల మహేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.