ధైర్యంగా ఉండండి నేనున్నాను

ధైర్యంగా ఉండండి నేనున్నాను

రంజిత్ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పిన బండి సంజయ్ 
 ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్  మారవేణి రంజిత్ కుమార్ గత పది రోజుల క్రితం అరెస్టు అయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఫోన్ ద్వారా రంజిత్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం కల్పించాడు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని రంజిత్ తల్లి తెలుపగా ధైర్యంగా ఉండాలని నేనున్నానంటూ మనో ధైర్యాన్ని కల్పించారు.

అదేవిధంగా రంజిత్ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర కన్వీనర్ బండి సంజయ్ పిఏ ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి  శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు  బర్గం వెంకటలక్ష్మి,జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, కొండాపురం సత్యం రెడ్డి తదితరులు  పాల్గొని మనోధైర్యాన్ని కల్పించారు.