మహిళా ధారుణ హత్య

మహిళా ధారుణ హత్య
  • హత్య చేసి ఇంట్లోనే తగులబెట్టారు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. మహిళను హత్య చేసి ఆమెను తగులబెట్టారు. ఇండో అమెరికన్ స్కూల్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న బోజమ్మ అనే మహిళను హత్య చేసి తగలబెట్టి దండగులు పారిపోయారు. ఇంట్లో నుంచి పొగలు రావటం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృత దేహంపై సుత్తెతో తలపై కొట్టి హత్య చేసిన ఆనవాళ్ళు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంగటన స్థలం కు చేరుకున్న డాగ్, క్లూస్ టీం,  కేసు దర్యాప్తు చేస్తున్నారు.