కుక్కల దాడిలో గొర్రెలు మృతి

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- గొర్రెల మందపై వీది కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 12 గొర్రెలు మృతి చెందాయి  ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో చోటుచేసుకుంది. పురపాలక కేంద్రానికి చెందిన బాత్క లింగయ్య రోజు మాదిరిగా గొర్రెలను ఆదివారం గొర్రెలను కొట్టంలో వదిలి ఇంటికి వెళ్ళాడు మంగళవారం తెల్లవారుజామున లింగయ్య కొట్టానికి వచ్చి చూసేసరికి 12 గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందడాన్ని గమనించి లబోదిబోమన్నాడు. వీటి విలువ సుమారు లక్షన్నర వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు.