భువనగిరి నియోజకవర్గం లో నియమించిన కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని గాంధీ భవన్ లో మల్లు రవి కారును అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

భువనగిరి నియోజకవర్గం లో నియమించిన కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని గాంధీ భవన్ లో మల్లు రవి కారును అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

భువనగిరి జూలై 6 (ముద్ర న్యూస్) :-హైదరాబాద్ గాంధీ భవన్ లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలకు బుధవారం నూతన అధ్యక్షులను నియమిస్తున్నట్లు పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి పేరు మీద ఉత్తర్వులు జారీ చేయబడ్డ కాపీలు ప్రకటించడాని నిరసిస్తూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు  మల్లు రవి ని కారును అడ్డుకున్నారు. కమ్యూనిస్టు, టిడిపి, బిఆర్ఎస్ నుండి వచ్చిన వారికి ఏ విధంగా పదవులు ఇస్తారని  ఈ నియామకాలు పూర్తిగా అప్రాజస్వామికంగా అన్నారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా కనీసం స్థానిక పార్లమెంట్ సభ్యులు పీసీసీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కూడా సమాచారం ఇవ్వకుండా వెయ్యడం దారుణమన్నారు. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి  పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిరిసిల్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ గౌడ్ తదితరులతో చర్చించకుండా స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేయకుండా  కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా నియమించడం సరికాదన్నారు.  ఈ కమిటీలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోధ శ్రీనివాస్ గౌడ్, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి కాంగ్రెస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గత 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ మాపై కేసులు పెట్టించుకోని ప్రతిపక్ష పార్టీల నాయకులతో దాడులు జరిగిన కూడా  మా జీవితాలను కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేయడం జరిగిందన్నారు.  ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  పార్టీ నియమావాలని పాటించకుండా తన సొంత ఎజెండాను అమలు చేస్తూ తన తాబేదారులకు పార్టీ విధి విధానాలపై ఎలాంటి అనుభవం లేని వాళ్లకు అనిల్ రెడ్డి  చెప్పు చేతిలో వ్యాపారం మాదిరిగా పార్టీని మార్చడం సరికాదన్నారు.  ఇప్పటికైనా విచారణ జరిపి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీలో అనుభవాన్ని గుర్తించి పార్టీ పదవులను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సిరికొండ శివకుమార్, పులిగిల్ల బాలయ్య, గుమ్మడిల్లి రమేష్, ఉడత కార్తీక్, కొండాపురం గణేష్, పుట్ట కృష్ణ యాదవ్, బబ్బురి నరసింహ గౌడ్, షానూర్ బాబా, నరసింహ, ధరణికోట పాండు, సాయిలు, ఎండి ఫకీర్ అహ్మద్  పాల్గొన్నారు.