యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి రెండు గంటల సమయం

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి రెండు గంటల సమయం

ముద్ర,తెలంగాణ:-యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు ఉదయం నుంచి భక్తులను క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతించారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం కాగా.. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ రుసుముతో దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.