సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
![సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2024/07/image_750x_66827f0a7d501.jpg)
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన మొదటి ప్రాధాన్యత అని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం తాడూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైజ్ఞానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగానే నియోజకవర్గంలో కూడా విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటలపాటు తాను అందుబాటులో ఉంటారని అన్నారు.
ఉపాధ్యాయులతో విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం జరిగిందని రహదారుల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను కోరాలని వాటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్మన్నారు తాను విద్య ద్వారానే వైద్యుడిగా రాజకీయ నాయకుడిగా ఎదగడం జరిగిందని తెలిపారుఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు జడ్పిటిసి రోహిణి గోవర్ధన్ రెడ్డి ఎంపీపీ శ్రీదేవి ,ఎంపీటీసీ రేణుక మల్లయ్య , పర్వత్ రెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
.